నిడమనూరు, ఏప్రిల్ 19 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొమెర సైదమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, ఎంపీపీ గౌరవ సలహాదారుడు బొల్లం రవి యాదవ్, ఏపీఎం నర్సింహ, నాయకులు కన్నెబోయిన ఆనంద్, సింగం రామలింగయ్య పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని కొరటికల్, కొంపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మొ గుదాల సాలయ్యగౌడ్, మిర్యాల లక్ష్మమ్మ, సర్పంచులు వల్లూరి పద్మ, జాల వెంకన్న, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, ఉప సర్పంచ్ యాదగిరిగౌడ్, ఏపీఎం శ్రీదేవి పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలకేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ పందుల యాదయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో శివన్నగూడెం వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్ గౌడ్, సర్పంచులు నల్ల యాదయ్య, కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ఏడీఏ ఎల్లయ్య, సీఈఓ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ బాలం నర్సింహ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దంటు జగదీశ్వర్ పాల్గొన్నారు.
కనగల్ : చెట్లచెన్నారంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సర్పంచ్ గన్నెబోయిన గంగమ్మా చంద్రయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ పేర్వాల రామరావు ప్రారంభించారు. కార్యక్రమంలో చిట్టిమళ్ల కోటయ్య, చిట్టిమళ్ల అంబికా, నారగోని సత్తెమ్మ, మద్దెల రేణుక, శశిరేఖ పాల్గొన్నారు
కొండమల్లేపల్లి: స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీను, సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పసునూరి యుగేంధర్రెడ్డి, దస్రు, వస్కుల కాశయ్య, అలుగుల సైదిరెడ్డి, బావండ్ల దుర్గయ్య పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని రంగారెడ్డిగూడెం, మేడారం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అలుగుబెల్లి శోభరాణి, సర్పంచ్ కాలుసాని అరుణ, ఏపీఎం లలిత, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఏఓ పాండు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని మాదారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, సర్పంచ్ జెర్రిపోతుల మంజులచంద్రమౌళిగౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నిమ్మల ఆంజనేయులుగౌడ్, నోముల శ్రీను, చింతల శంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హాలియా: మండలంలోని శ్రీనాథపురం, రామడుగు, పులిమామిడి, మారేపల్లి గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించినట్లు ఏపీఎం కళావతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 11 గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాలను మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పంగవానికుంట, నాయుడుపాలెం, కొ ట్టాల, మదారిగూడెం, పేరూరు, వీర్లగడ్డతండా, కొరివినేనిగూడెం గ్రామాల్లో త్వరలోనే ప్రారంభించనున్నట్లు వివరించారు.