‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిప్పులు చెరిగారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్కు పోరుబాట బస్సుయాత్ర చేరుకున్నది. గడియారం చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించాయన్నారు. కేవలం అధికారం కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసి మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ గ్యారెంటీలిచ్చింది. ఇప్పుడెవరికైనా రైతుబంధు వచ్చిందా? కల్యాణలక్ష్మి వచ్చిందా? రూ.2వేల పింఛన్ రూ.4వేలు అయ్యిందా? అని ప్రశ్నించారు. చోటేమియా, బడేమియాలకు ఓటేస్తే మనల్ని పాతాళానికి తొక్కుతారన్నారు.
అచ్చేదినా..? సచ్చేదినా..? అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కిన బీజేపీకి ఎం దుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ‘ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే.. మరోవైపు ఆంధ్రకు నీళ్లు ఎత్తుకుపోతున్న వాళ్లకు ఇదే డీకే అరుణ రాయలసీమకు పోయి హారతులు పట్టింది.. అందుకు ఆమెకు ఓటేయాల్నా’ అంటూ ప్రశ్నించారు. పాలమూరు ఎంతో వెనుకబడిందని.. ఇక్కడ కడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హో దా ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలే కదా? ఒక్కసారైనా జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగిందా? హోదా ఇప్పించే ప్రయత్నం చేసిందా? వీళ్లకా మనం ఓటేసేది? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలే.. స్కూటీలు రాలే కానీ లూటీ చేస్తున్నారని విమర్శించారు.
‘నాకండ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోను. కేసీఆర్ యుద్ధం చేస్తడే తప్పా ఊరుకునే వ్యక్తి కాడు. చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దా మా? యుద్ధానికి అందరం సిద్ధమవుదామా?.. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే.. ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేసేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.