కోల్కతా: ఒక కార్గో విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని సమీప ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ( emergency landing) చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన కార్గో విమానం జెడ్డా నుంచి హాంకాంగ్కు వెళ్తున్నది. ఆ విమానం భారత గగనతలంపై ఎగురుతుండగా దాని విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. గమనించిన విమాన పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ కార్గో విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఆ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.
కాగా, సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన కార్గో విమానం శనివారం మధ్యాహ్నం 12.02 గంటలకు కోల్కతా ఎయిర్పోర్ట్లో సేఫ్గా దిగింది. ఆ కార్గో విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సౌదీ ఎయిర్లైన్స్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితిని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు. దుబాయ్కు వెళ్తున్న ఫెడ్ఎక్స్ కార్గో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత అది దుబాయ్కు బయలుదేరింది.
Also Read: