న్యూఢిల్లీ, మార్చి 19: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్కు 8సార్లు సమన్లు అందాయి. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ కోర్టుకు వెళ్లింది. తప్పనిసరి పరిస్థితిలో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.