Loksabha Elections 2024 : రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్ధానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపండని కేజ్రీవాల్ కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రజలు అమాయకులని కాషాయ పాలకులు భావిస్తున్నారని అన్నారు.
బీజేపీకి ఢిల్లీ ప్రజలే దీటుగా బదులిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జైలుపాలైనా సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించగా తాను రాజీనామా చేస్తే తదుపరి బెంగాల్లో మమతా బెనర్జీ, కేరళలో పినరాయి విజయన్, తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఇలా విపక్ష సీఎంలను మోదీ సర్కార్ టార్గెట్ చేస్తుందని బదులిచ్చారు.
విపక్ష నేతలను అరెస్ట్ చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. తనకు పదవీ కాంక్ష లేదని, అయితే తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మురికివాడల్లో పనిచేసేందుకు తాను ఆదాయ పన్ను శాఖ కమిషనర్ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. అయితే ఇదంతా తమ పోరాటంలో భాగమని, ఈసారి తాను సీఎం పదవి నుంచి వైదొలగబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read More :
GHMC | గ్రేటర్లో 2 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ