న్యూఢిల్లీ : దేశ రాజధాని వరద గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. యమునా నది రికార్డు స్ధాయిలో ప్రవహిస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ (Delhi Floods) నగరవాసులను పీడిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. యమున నదిలో నీటి ప్రవాహం 1978లో గరిష్ట స్ధాయి 207.48 మీటర్లను దాటిన తర్వాత తొలిసారిగా 207.71 మీటర్లకు పెరగడంతో సీఎం కేజ్రీవాల్ బుధవారం అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రమాదస్ధాయిని మించి యమునా నది ప్రవహిస్తుండటంతో వరద పరిస్ధితిపై కేజ్రీవాల్ అధికారులతో సమీక్షించారు. నదిలో నీటి ప్రవాహ స్ధాయి మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు వెళ్లాలని కోరారు. వరద నీటిని చూసేందుకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని నీటి ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుండటం ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
యమున నదికి సమీపంలోని ఆరు జిల్లాల్లో సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే నగరంలోని స్కూల్స్ను మూసివేసి వాటిని పునరావాస శిబిరాలుగా మార్చాలని కేజ్రీవాల్ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను ఆదేశించారు.
Read More :