Loksabha Elections 2024 : తనను దేవుడు పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్దాయిలో స్పందించారు. మోదీని మీరూ దేవుడి అవతారంగా భావిస్తున్నారా అని ఆరెస్సెస్ను ఆయన నిలదీశారు. ఈ వ్యవహారంపై ఆరెస్సెస్ తన వైఖరి వెల్లడించాలని కేజ్రీవాల్ కోరారు.
బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, ధరల మంట, నిరుద్యోగంపై ప్రజలు విసిగిపోయారని ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కేజ్రీవాల్ బుధవారం ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. యువతకు ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడుతున్నారని, దైనందిన ఖర్చులను ప్రజలు భరించలేని పరిస్ధితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ తమ సమస్యలు తీరుస్తారని ఆశగా వేచిచూస్తున్న ప్రజలను ఆయన నిరాశపరుస్తున్నారని అన్నారు. టీవీ ఆన్చేయగానే మోదీ ఎవరినో ఒకరిని తిడుతూ కనిపిస్తున్నారని, ప్రజా సమస్యలను ఆయన ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. విపక్షాలు ప్రజల ఆస్తులు లాగేసుకుంటాయని, మంగళసూత్రాలను తస్కరిస్తాయని దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు.
దేశ ప్రధాని నుంచి ప్రజలు ఇలాంటి మాటలు ఆశించలేదని, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఆయన మాట్లాడతారని ఆశించారని అన్నారు. మోదీని దేవుడిగా అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మనం రాముడిని, కృష్ణుడిని, శివుడిని దేవుడిగా నమ్ముతామని అసలు మోదీని దేవుడిగా మనం ఎలా అంగీకరిస్తామని అన్నారు.
Read More :
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు