Loksabha Elections 2024 : పంజాబ్ ప్రజలు కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అమిత్ షా ప్రకటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ అమిత్ షాను రాష్ట్రానికి సంబంధించి మీ ఆలోచనలేంటని పంజాబ్ ప్రజలు అడగాలని కోరుకుంటున్నారని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ సోమవారం భటిండాలో విలేకరులతో మాట్లాడారు. పంజాబ్లో 117 సీట్లకు గాను తమకు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐలను పంపుతారా లేక పంజాబ్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తారా అని కేజ్రీవాల్ కాషాయ పాలకులను నిలదీశారు. మీకు ఉచిత్ విద్యుత్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 13 లోక్సభ స్ధానాలను ఆప్నకు కట్టబెట్టండని ఆయన పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తన మధ్యంతర బెయిల్ను ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ తాను బరువు బాగా తగ్గానని, ఎలాంటి కారణం లేకుండా నెలలో 7 కిలోలు తగ్గితే తీవ్ర సమస్యని వైద్యులు చెప్పారని తెలిపారు. పలు పరీక్షలు నిర్వహించాలని వైద్యులు తనకు సూచించారని, వారం రోజుల్లో తాను అన్ని పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. శరీరంలో ఏదైనా తీవ్ర వ్యాధి ముంచుకొస్తున్నదా లేదా అనేది ఈ పరీక్షల్లో వెల్లడవుతుందని అన్నారు.
Read More :
IRS Officer | డేటింగ్ యాప్లో పరిచయం.. ఐఆర్ఎస్ అధికారి ఫ్లాట్లో మహిళ మృతదేహం