న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది పంజాబ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ఆమ్ ఆర్మీ పార్టీ గెలిస్తే.. 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన వ ఎల్లడించారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పెద్ద మహిళా సాధికారత ప్రోగ్రామ్గా మారుతుందని ఆయన అన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నా.. ఆ మొత్తాన్ని ఇస్తామని ఆయన తెలిపారు. పంజాబ్లో ఓ నకిలీ కేజ్రీవాల్ తిరుగుతున్నారని, తాను చేసిన వాగ్ధానాలను ఆ నకిలీ కేజ్రీ కూడా చేస్తున్నారని అన్నారు. యావత్ దేశంలో విద్యుత్తు బిల్లులను తగ్గించే ఒకే ఒక వ్యక్తి కేజ్రీవాల్ అని తెలిపారు. అందుకే నకిలీ కేజ్రీ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.