Arvind Kejriwal : ఛండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత రాఘవ్ చద్దా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని దేశ ద్రోహ, నిజాయితీ లేని పార్టీగా అభివర్ణించారు. చండీఘడ్ మేయర్ ఎన్నికల్లో పట్టపగలే బీజేపీ అనైతికంగా వ్యవహరించిన తీరు గర్హనీయమని, మేయర్ ఎన్నికల్లో దిగజారిన కాషాయ నేతలు ఇక లోక్సభ ఎన్నికల్లో ఎంతకైనా తెగిస్తారని కేజ్రీవాల్ అన్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విచారకరమని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఛండీఘఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో 36 స్ధానాలకు గాను బీజేపీ మేయర్ అభ్యర్ధి మనోజ్ సోంకర్ 16 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ సభ్యులు 8 మంది ఓట్లతో కలిపి ఆప్ మేయర్ అభ్యర్ధికి 20 ఓట్లు రావాల్సి ఉండగా 8 ఓట్లు చెల్లుబాటు కావని ప్రకటించారు.
దీంతో ఆప్ మేయర్ అభ్యర్ధికి కేవలం 12 ఓట్లు పోలయ్యాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి, బీజేపీకి మధ్య జరిగిన తొలి ముఖాముఖి పోరులో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించడంతో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Read More :
London Train: లండన్ మెట్రోరైలులో పంచ్లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో