Arvind Kejriwal | ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా (Misbehaved) ప్రవర్తించారని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్ల దురుసుగా ప్రవర్తించింది కూడా ఈ పోలీసు అధికారే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి తొలగించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue Court)ను కోరారు.
ఈ మేరకు కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ దరఖాస్తుపై విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏకే సింగ్ (AK Singh) తనతో దురుసుగా ప్రవర్తించారని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఈడీ సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే వ్యవహరించారని వెల్లడించారు.
కాగా, గతేడాది ఇదే కోర్టు ఆవరణలో విలేకరులు సిసోడియాను ప్రశ్నిస్తున్న సమయంలో ఏకే సింగ్ తన మెడ పట్టుకుని బలవంతంగా నెట్టారు. దీనిపై సిసోడియా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏకే సింగ్ చర్యను ఢిల్లీ పోలీసులు సమర్థించారు. పైగా నిందితులు మీడియాతో మాట్లాడటం తప్పు అని సిసోడియా చర్యనే ఢిల్లీ పోలీసులు తప్పుపట్టారు. అయితే ఈ విషయంపై అప్పట్లో స్పందించిన కేజ్రీవాల్ ‘మనీష్జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా?’ అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఆ పోలీసు అధికారే ఇప్పుడు తనపట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడంటూ కేజ్రీ ఆరోపించారు.
Also Read..
Spurious Liquor | పంజాబ్లో కల్తీమద్యం కలకలం.. 21కి పెరిగిన మృతులు
Elephant Fight | ఆలయ ఊరేగింపులో అపశ్రుతి.. ఏనుగుల ఫైటింగ్తో తొక్కిసలాట.. VIDEO
Mahua Moitra | టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు