Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మరో ఏనుగుపై దాడి చేసి దాన్ని అక్కడి నుంచి పరిగెత్తించింది.
త్రిస్సూర్ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్ ఆచార ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు రెండు ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న గురువాయూర్ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్ ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. తోటి గజరాజుపై దాడికి దిగింది. మావటిని కిందపడేసి తొండంతో దాడి చేసింది.
ఈ ఘటనతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన కారణంగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు విషయం తెలుసుకున్న ఎలిఫెంట్ స్వ్కాడ్ వెంటనే అక్కడికి చేరుకొని అతికష్టం మీద రెండు ఏనుగులను కంట్రోల్లోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ആറാട്ടുപുഴ പൂരത്തിനിടെ ആനകൾ തമ്മിൽ കൊമ്പുകോർത്തു pic.twitter.com/rExJ8Bdd2G
— Samakalika Malayalam (@samakalikam) March 23, 2024
Also Read..
Mahua Moitra | టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. నెలక్రితమే హెచ్చరించామన్న అమెరికా
Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్