న్యూఢిల్లీ : ప్రముఖ ఆర్టిస్ట్, కవి ఇమ్రోజ్ (97) (Imroz) వయోభారంతో శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇమ్రోజ్ ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో గత కొద్దిరోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రోజ్ను ఇటీవల తిరిగి ఇంటికి తీసుకురాగా శుక్రవారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు ప్రకటించారు.
1926లో పంజాబ్లో జన్మించిన ఇమ్రోజ్ అసలు పేరు ఇంద్రజిత్ కాగా పంజాబీ కవయిత్రి అమృతా ప్రీతంతో 1950ల్లో ఏర్పడిన పరిచయం వారిని దగ్గరకు చేర్చింది. 2005లో ప్రీతం మరణించేవరకూ వారు దాదాపు 40 ఏండ్లు పైగా సహజీవనం చేశారు. తొలుత ప్రీతం రచనలకు ఇమ్రోజ్ ఇలస్ట్రేటర్గా పనిచేశారు. ప్రీతం కవిత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రేమ, వైఫల్యం, మానవ సంబంధాల చుట్టూ తన భావాలను ఇమ్రోజ్ కాన్వాస్పై పరిచేవారు.
ప్రీతం అనారోగ్యం బారినపడిన వెంటనే ఇమ్రోజ్ రచనా వ్యాసంగం చేపట్టి పలు పుస్తకాలను రాసి ఆమెకు అంకితమిచ్చారు. వారి రిలేషన్షిప్ స్ఫూర్తితోనే ప్రీతం రచనలు అధికంగా ప్రేమ, సాన్నిహిత్యం చుట్టూ సాగేవి. 2004లో ప్రీతం రాసిన మై తూ ఫిర్ మిలేంగిని ఇమ్రోజ్కు అంకితం చేశారు.
Read More :
Ankita Raina | బాయ్ఫ్రెండ్ను పెళ్లాడిన భారత టెన్నిస్ స్టార్.. ఫొటోలు వైరల్