చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మధ్యాహ్నం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. ప్రస్తుతం ఆయన పాటియాల సెంట్రల్ జైలులో ఉన్నారు. సిద్ధూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్కి తరలించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ మే 20న స్థానిక కోర్టులో లొంగిపోయిన తర్వాత పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. 1988లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సుప్రీం కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించిన విసయం తెలిసిందే. రెండు వారాల క్రితం సిద్ధూను వైద్య పరీక్షల నిమిత్తం పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.