న్యూఢిల్లీ, ఆగస్టు 1: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. తన వారసుడి పేరును సూచించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కేంద్ర న్యాయశాఖ కోరినట్టు సమాచారం.
ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జూలై 25న సీజేఐకి లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై సీజేఐ ఇంకా స్పందించాల్సి ఉన్నది. జస్టిస్ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు.