ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టనున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ లినజేలా తెలిపారు. వాస్తవానికి ఆదివారం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్తోపాటు మిజోరం ఓట్ల లెక్కింపు కూడా చేపట్టాల్సి ఉన్నది. అయితే ఆదివారం తమకు ప్రత్యేక దినమని, ఆ రోజు కౌంటింగ్ వద్దంటూ ఆ రాష్ట్ర ప్రజలు, పలు సంస్థలు చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది. 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరుగగా, ప్రధానంగా అధికార ఎంఎన్ఎఫ్తో పాటు జడ్పీఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి.