Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. గత కొన్నిరోజులుగా ఢిల్లీ సహా ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదక స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి అధికార నివాసం, మంత్రుల ఇళ్లు, రాజ్ ఘాట్, అసెంబ్లీ, దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎర్రకోట సహా అన్ని ప్రాంతాలకు వరద నీరు తాకింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో ఢిల్లీ మొత్తం మరో నదిలా తలపిస్తోంది.
అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలి అయిన ఢిల్లీలోని ఐటీఓ (ITO) క్రాసింగ్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వరద నగరంలోకి ప్రవేశించడానికి యమునా నదిలో నీటి మట్టం పెరడంతో డ్రెయిన్ రెగ్యులేటర్ తెగిపోవడమే (drain regulator broke) కారణమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. ఈ మేరకు వరద పరిస్థితులను పరిష్కరించేందుకు సైన్యం, విపత్తు సహాయక దళం సహాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సైన్యం (Army) రంగంలోకి దిగింది.
మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి కొంత మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 208.46కు తగ్గింది. మధ్యాహ్నం తర్వాత నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గొచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. మరోవైపు వరదల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
#WATCH Delhi: People face problems due to water-logging situation on ITO road due to the increase in the water level of the Yamuna River. pic.twitter.com/XEOY6F4BGl
— ANI (@ANI) July 14, 2023
This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023
Also Read..
Heavy Rains | వరదలకు 145 మంది బలి.. అతలాకుతలమైన హిమాచల్
Upasana | మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన
School Building Washed Away | వరద నీటిలో కొట్టుకుపోయిన పాఠశాల.. ఎక్కడంటే..?