(MM Naravane) శ్రీనగర్ : భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ము డివిజన్లో ఆయనకు ఆర్మీ అధికారులు ఘన స్వాగతం పలికారు. జమ్ము డివిజన్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాలను కూడా ఆయన సందర్శించనున్నారు. రాజౌరీలో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులతో సమాలోచనలు జరుపుతారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె జమ్ము డివిజన్లోని రాజౌరి జిల్లాకు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆర్మీ అధికారులతో చర్చిస్తున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోని ఫార్వర్డ్ ఏరియాలను కూడా ఆయన సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకోనున్నారు. జమ్ము ప్రాంతంలో నరవణె పర్యటన చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం రాజౌరి, పూంచ్ సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి చాలా సున్నితంగా, ఉద్రిక్తంగా ఉన్నది. సరిహద్దు దాటి పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం మేరకు సైన్యం, పోలీసు సిబ్బంది వారం రోజులుగా దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు జూనియర్ కమాండెంట్ అధికారులతో పాటు తొమ్మిది మంది జవాన్లు వీరమరణం పొందారు. సరిహద్దు ప్రక్కనే ఉన్న అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. అక్టోబర్ 1 వ తేదీన నరవణె లఢఖ్ సెక్టార్లో రెండు రోజుల పాటు పర్యటించారు.
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
దీపావళి పండుగ ఆఫర్లు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..