న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అవయవదానానికి సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేయనుంది. అవయవాల కోసం రిజిస్ట్రేషన్, కేటాయింపునకు ఏకరీతి నిబంధనలు తీసుకురానున్నది. ఇందుకోసం ‘వన్ నేషన్, వన్ ఆర్గాన్ అలొకేషన్’ పాలసీని తేనున్నది.
కొత్త పాలసీ ప్రకారం.. అవయవ గ్రహీతలపై ప్రస్తుతం ఉన్న 65 ఏండ్ల పరిమితిని ఎత్తివేయనున్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అవయవాల కోసం దరఖాస్తు చేసుకోనే అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా రద్దు చేయనున్నారు.