GPS | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: స్మార్ట్ఫోన్లలో వాడే జీపీఎస్ టెక్నాలజీ (పొజిషినింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తుంది) అమెరికాది. ఈ జీపీఎస్కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్’ సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిసారిగా ఐఫోన్15 ద్వారా భారత్లో అందుబాటులోకి రాబోతున్నది.
వైమానిక, సముద్ర, భూగోళ రవాణా, సర్వేయింగ్, సైంటిఫిక్ పరిశోధన, లొకేషన్ సేవలు, వ్యక్తిగత రవాణా, వనరుల పర్యవేక్షణ మొదలైన వాటిపై ‘నావిక్’ అప్లికేషన్తో సేవలు అందుతాయి. ఇందుకోసంగానూ 2018లో ఇస్రో 7 శాటిలైట్స్ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దేశీయ తయారీ నావిక్ అప్లికేషన్ను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లు తీసుకురావాలని భారత్ గతకొంత కాలంగా శామ్సంగ్, షావోమీ, యాపిల్ తయారీ సంస్థల్ని కోరుతున్నది.