పనాజీ: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే ఈసారైనా గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేయాలని చూసింది. ఫలితాలు మాత్రం ఆశించినంతగా రాలేదు. ప్రారంభం నుంచి ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేని ఆప్.. ఇప్పుడు రెండు స్థానాల్లో ముందంజ వేసింది.
రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో 17 సీట్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 4, ఆప్ 2, ఇతరులు 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.