విశాఖ మహానగరం మిలన్-2022కు వేదికగా మారడంతో విదేశీ అతిథులతో కలకలలాడుతున్నది. మిలన్ పరేడ్లో వివిధ దేశాల నౌకదళాలు పాల్గొని చేసే విన్యాసాల కోసం విశాఖ పౌరులు వేచి చూస్తున్నారు. సముద్రంలో నౌకలు, ఆకాశంలో విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ బిజీబిజీ మారింది. కొద్ది సేపటి క్రితం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధనౌకను సీఎం జగన్ జాతికి అంకితమిచ్చారు. సాయంత్రం ఆర్కే బీచ్లో మిలన్ పరేడ్ను జగన్ ప్రారంభిస్తారు.
విశాఖపట్నంలో జరుగుతున్న మిలన్-2022 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చారు. తూర్పు నావికా దళం నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. తర్వాత ఐఎన్ఎస్ వేలాను సందర్శించారు.
నేవీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో సాయంత్రం మిలన్ పరేడ్ జరగనున్నది. గంటన్నరపాటు సాగే సముద్ర, గగనతల యుద్ధ విన్యాసాలను వీక్షిస్తారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలకు చెందిన 13 యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. సాయంత్రం జరిగే పరేడ్లో వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు.