భారతీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సాంకేతిక లోపంతో సతమతమవుతోంది. తాజాగా, మంగళూరు నుంచి దుబాయ్కి బయలుదేరిన స్పైస్జెట్ బోయింగ్ 737 విమానం ముందు చక్రంలో సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేశారు. దాన్ని పరిశీలించిన తర్వాత విమానం నడిపేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి అనుమతించారు. అలాగే, స్పైస్జెట్ ఎయిర్లైన్ దుబాయ్కి ప్రత్యామ్నాయ విమానాన్ని కూడా పంపింది.
ల్యాండింగ్ సమయంలో ఇంజినీర్లు ముందటి చక్రం స్ట్రట్ సాధారణం కంటే ఎక్కువగా కుదించుకుపోయినట్లు గమనించారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని నిలిపివేశారు. ల్యాండింగ్ గేర్ స్ట్రట్ను తనిఖీ చేసిన తర్వాత అధికారులు విమానం నడిపేందుకు అనుమతించారు. ఓలియో స్ట్రట్లో ఉపయోగించిన నైట్రోజన్ తగ్గిపోవడం లేదా అంతర్గత సీల్ దెబ్బతినడం వల్ల సమస్య ఏర్పడి ఉండవచ్చని డీజీసీఏ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనతో స్పైస్జెట్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్లు గత 24 రోజుల్లోనే తొమ్మిదిసార్లు సాంకేతిక లోపంతో నిలిపివేసినట్లైంది. తరుచూ విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తుతుండడంతో స్పైస్జెట్ సంస్థకు డీజీసీఏ ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.