Electoral Bonds | సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-20 సంవత్సరానికి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ డేటాను అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచింది. తాజాగా సుప్రీంకోర్టులో ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరో పిటిషన్ దాఖలైంది. ఇందులో మార్చి ఒకటి 2018- ఏప్రిల్ 11, 2019 వరకు విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సైతం బహిర్గతం చేసేలా చూడాలని పిటిషనర్ కోరారు. కేంద్రం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరిలో సంచలన తీర్పును వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దాంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ పథకం కింద 12 ఏప్రిల్ 2019 నుంచి 15 ఫిబ్రవరి 2024 వరకు విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఆదేశించిన విషయం విధితమే. అయితే. మార్చి 2018 నుంచి ఏప్రిల్ 2019 మధ్య రూ.4,002 కోట్ల విలువైన 9,159 బాండ్లను విక్రయించారని.. ఈ వివరాలను సైతం బహిర్గతం చేయాలని సిటిజన్ రైట్స్ ట్రస్ట్ పిటిషన్లో కోరింది. ఈ మేరకు మార్చి 1, 2018 నుంచి ఏప్రిల్ 11, 2019 వరకు విక్రయించిన, ఎన్క్యాష్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేలా ఎస్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.