ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకి మరో ఎంపీ షాకిచ్చారు. ఉద్ధవ్ నేతృత్వలోని శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్ కీర్తికర్.. సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. దీంతో షిండే వర్గంలో చేరిన ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈనేపథ్యంలో ఆయనను తమ థాక్రే శివసేన నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, ముంబైలో మొత్తం ఆరు లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన మూడుచొప్పున గెలుపొందాయి. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో శివసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇప్పటికే షిండే వర్గంలో చేరిపోయారు. ఇక మిగిలింది ఉద్ధవ్ వర్గంలో ఎంపీ అరవింద్ సావంత్ ఒక్కరే మిగిలిపోయారు. ఇక శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండే వర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.