డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరో పరువునష్టం కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జనవరి 9న ప్రసంగించిన ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యులు 21వ శతాబ్ధపు కౌరవులని వ్యాఖ్యానించారు. ‘కౌరవులు ఎవరు? ముందుగా మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వారు హాఫ్ ఖాకీ ప్యాంటు ధరిస్తారు. చేతిలో లాఠీలు, శాఖలు పట్టుకుంటారు. భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లు ఆ కౌరవుల వెంట నిలిచి ఉన్నారు’ అంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
కాగా, బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా దీనిపై హరిద్వార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేశారు. ఈ నెల 12న దీనిపై కోర్టు విచారణ జరుగుతుందని కమల్ భదౌరియా తరుఫు న్యాయవాది అరుణ్ భదౌరియా తెలిపారు.
మరోవైపు ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఉంది’ అని రాహుల్ గాంధీ గతంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆయనను దోషిగా గుజరాత్లోని సూరత్ కోర్టు గత నెలలో నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.
Haridwar, Uttarakhand | A defamation case has been filed against Congress leader Rahul Gandhi by RSS worker Kamal Bhadauria in Haridwar court. Hearing is on April 12. Rahul Gandhi said in Haryana that RSS is the Kaurava of 21st century: Arun Bhadauria, Advocate pic.twitter.com/nhOjG2lZtm
— ANI (@ANI) April 1, 2023
Also Read: