న్యూఢిల్లీ: గులాబ్ తుఫాను గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గురువారం ఉదయం సమయానికి ఈ తుఫాను ఏర్పడుతుందని వారు అభిప్రాపయపడుతున్నారు. బంగాళాఖాతంలో పుట్టిన గులాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన సంగతి తెలిసిందే.
ఈ తుఫాను ముగిసినప్పటికీ ఈదురుగాలుల ప్రభావం ఇంకా ఉందని, అవి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రయాణించి ప్రస్తుతం గుజరాత్ చేరాయని ఐఎండీ పరిశోధకులు తెలిపారు. వీటి కారణంగా గుజరాత్పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇది ఆ తర్వాత తుఫానుగా మారనుంది. దీనికి ’సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది.
ఈ తుఫాను భారత్పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్పారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఉత్తర కొంకణ్, గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ విధించారు.