భోపాల్ : కునో జాతీయ పార్కులో మంగళవారం మరో చీతా మృతి చెందింది. గత నాలుగు నెలల కాలంలో నుంచి తెచ్చిన చీతాలలో ఇది ఏడో మరణం. మంగళవారం 11 గంటలకు తేజస్ అనే మగ చీతా మెడ పై భాగంలో గాయాలున్నట్టు నియంత్రణ బృందం గుర్తించింది.
గాయాలకు మందు వేసి చికిత్స చేసినప్పటికీ చీతా మరణించింది. కునో నేషనల్ పార్కు నుంచి రెండు చీతాలను అడవిలోకి వదిలిన కొద్దిసేపటికే ఈ మరణం సంభవించింది. ఇప్పటివరకు సంభవించిన ఏడు చీతాల (అందులో మూడు పిల్లలు) మరణానికి నిర్వహణ లోపం ఏమీ లేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.