కోల్కతా : మండు వేసవిలో ఉష్ణోగ్రతలు (Hot Summer) గరిష్ట స్ధాయికి చేరడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఎండ వేడిమిని భరించలేక జంతువులు సైతం చల్లదనం కోసం పరితపిస్తున్నాయి. బెందాల్లోని అలీపూర్ జూలో జంతువులు చన్నీటి స్నానాలు, ఐస్ క్యూబ్స్ను ఆశ్రయిస్తూ సేదతీరుతున్నాయి.
ఎన్క్లోజర్లో ఉండే జంతువులు ఎండ వేడిని తట్టుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పులులు, ఎలుగుబంట్లు సహా జంతువులు చన్నీటి స్నానాలు, పూల్ బాత్స్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో వడగాడ్పులు వణికిస్తున్నాయి.
జంతువులను ఎండ వేడి నుంచి కాపాడేందుకు జూ సిబ్బంది ఎన్క్లోజర్స్పై నీళ్లు చల్లుతున్నారు. వేసవిలో మనం ఎండ తాపాన్ని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే జంతువులనూ కాపాడుకోవాలని, జంతువులు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు వాటికి ఓఆర్ఎస్ అందిస్తున్నామని అలిపూర్ జూ డైరెక్టర్ తపస్ దాస్ (ఐఎఫ్ఎస్) చెప్పారు.
Read More
viral video | ఫ్లైఓవర్పై తల్లితండ్రుల సైకిల్ సవారీకి చిన్నారి సాయం
Viral Video | నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ వృద్ధ దంపతుల వీడియో..