పట్నా : నవంబర్ 15 నుంచి అంగన్వాడీలు, ప్రాధమిక పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియంత్రణలు ఫలితాలను ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ట్వీట్ చేశారు.
కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా నిబంధనలను అనుసరించి అంగన్వాడీలు, ప్రాధమిక పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆగస్ట్ 16 నుంచే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ స్కూల్స్ను పునరుద్ధరించారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, స్కూలు బస్సుల్లో శానిటైజేషన్ వంటి నిబంధనలతో వీటిని అనుమతించారు.