అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడి తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న మండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వర్షం షురూ అయ్యింది. తిరుపతి పట్టణంతోపాటు, తిరుమల దేవస్థానంలో భారీగా వర్షం కురుస్తున్నది.
మండూస్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉన్నది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. మండూస్ ప్రభావంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము గంటలకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
398 coaches have been appointed across 21 sports disciplines this year: Union Minister for Youth Affairs & Sports, Anurag Thakur, in Lok Sabha
— ANI (@ANI) December 9, 2022