Pahalgam Attack | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో దాడికి పాల్పడిన (Pahalgam Attack) ఉగ్రవాదుల కోసం పోలీసు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు రివార్డు (reward) ప్రకటించారు.
ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని అనంత్నాగ్ పోలీసులు (Anantnag Police) ప్రకటించారు. ‘ఏప్రిల్ 22న పెహల్గామ్లోని బైసరన్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ జాతీయులు (Pakistan nationals), లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాలను బంధించడానికి, లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తాం. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము’ అని ‘ఎక్స్’లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలను కూడా పంచుకున్నారు.
J&K | Anantnag Police announces a reward of Rs 20 lakhs on information leading to the arrest of Pakistan nationals and LeT terrorists Adil Hussain Thoker, Ali Bhai and Hashim Musa, who were involved in the attack on tourists in Baisaran, Pahalgam on 22nd April pic.twitter.com/dfD9nbvBZj
— ANI (@ANI) April 24, 2025
Also Read..
PM Modi | కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్
Pahalgam Attack | ఉగ్రదాడి కారణంగా పాక్తో సింధు జలాల ఒప్పందం రద్దు.. ఇంతకీ ఏంటా ఒప్పందం..?
Pahalgam Attack | ఉగ్రదాడి.. భారత్లో పాకిస్థాన్ ఎక్స్ అకౌంట్ నిలిపివేత