ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే పోస్టులతో పాటు ఇన్స్పిరేషనల్ వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ వీడియోతో (Viral Video) నెటిజన్ల ముందుకొచ్చారు. మహారాష్ట్రలోని కలవంతిన్ దుర్గ్ పైకి పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తున్న వీడియోను పారిశ్రామిక దిగ్గజం ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ ప్రదేశం ఎక్కడున్నదో తనకు తెలియదని, అయితే ఈ ప్రదేశం ఎక్కడ ఉందో ఇప్పుడు తనకు తెలిసినా ఇక్కడ ట్రెక్కింగ్ చేయగలనో లేదో తాను చెప్పలేనని ఈ పోస్ట్లో మహీంద్ర గ్రూప్ చీఫ్ రాసుకొచ్చారు. ఇక్కడ ట్రెక్కింగ్ సవాల్తో కూడుకున్నదని అన్నారు. పశ్చిమ కనుమల్లో కలవంతిన్ దుర్గ్ శిఖరానికి ట్రెక్కింగ్ అత్యంత క్లిష్టమైనదని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy
— anand mahindra (@anandmahindra) July 22, 2023
ఈ వీడియోలో టూరిస్టులు కలవంతిన్ దుర్గ్ శిఖరానికి టూరిస్టులు ట్రెక్కింగ్ చేయడం కనిపిస్తుంది. శిఖరంపై మెట్ల మార్గం ఇరుకుగా ఉండటంతో ఇక్కడ ట్రెక్కింగ్ అంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ట్రెక్కింగ్ చేస్తున్న వారిలో ఒకరు ఈ వీడియోను రికార్డు చేయడంతో ఇది సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
Read More :