2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించింది. అంటే చైనా బడ్జెట్.. భారత్ కన్నా మూడు రెట్లు ఎక్కువన్నమాట. చైనా ప్రకటన తర్వాత చాలా మంది ఇదే విషయాన్ని ఎత్తిచూపారు.
ఇలాగైతే భారత్కు కష్టాలు తప్పవంటూ కొందరు కామెంట్లు చేశారు. వీటిపై ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా స్పందించారు.‘‘సైజుతో పని లేదు. భవిష్యత్తు యుద్ధ విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి’’ అని మహీంద్ర అన్నారు.
అదే సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకున్న ఆయన.. ‘‘ఉక్రెయిన్కు చెందిన సాయుధ డ్రోన్లు.. రష్యా మిలటరీ ట్యాంకులతో పోరాడుతున్నాయి. ఇది చూడలేదా?’’ అని అన్నారు. ఎంత ఎక్కువ ఖర్చు చేశామనేది మ్యాటర్ కాదని, ఎంత తెలివిగా ఖర్చు చేశామనేదే ముఖ్యమని మహీంద్ర పేర్కొన్నారు.
‘Size doesn’t matter.’ The future of warfare will be different. In the Ukraine, armed drones are playing havoc with convoys of tanks. It’s not how much we spend but how smartly we spend that will matter… https://t.co/K5VoFkZ6wd
— anand mahindra (@anandmahindra) March 9, 2022