గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
అయితే ఆదివారం దీనిలోని కొంత భాగం హఠాత్తుగా కూలిపోయింది. బలమైనగాలుల కారణంగానే కూలిందని అధికారులు చెప్పారు. కాగా, ఈ వంతెనకు ప్రమాదం ఏర్పడటం ఇది రెండోసారి.