కృష్ణగిరి/ముంబై : తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పెజాయపట్టై పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలు డు సంభవించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. దుర్ఘటనపై ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు కేటాయించింది.
బస్సులు ఢీకొని ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బుద్వానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితులందరూ అమర్నాథ్ యాత్ర ముగించుకొని తిరిగి హింగోలీ వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని ఎస్పీ సునీల్ కడస్నే పేర్కొన్నారు.