Earthquake: ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.