అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. అమృత్సర్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ను బాంబులతో పేల్చివేస్తామని, తుపాకులతో కాల్పులు జరుపుతామని గుర్తుతెలియని వ్యక్తులు ప్రిన్సిపల్ను బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్ పాఠశాలను ఖాళీ చేయించారు. స్కూల్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇండ్లను ఖాళీచేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీ గుర్జీత్ సింగ్ స్కూల్కు రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే బాంబు స్క్వాడ్ను పంపించాలని కోరారు. పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.
Dear Sh. @BhagwantMann ji, it has be reported that @PunjabPoliceInd has combed a famed school in Amritsar for contraband and other substances. As per sources certain recoveries have also been made but authorities are trying to cover-up entire effort under some pretext. 1/2
— Gurjeet Singh Aujla (@GurjeetSAujla) September 7, 2022