Loksabha Elections 2024 : విపక్ష కూటమికి ఓ దశాదిశా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని సిద్ధార్ధనగర్లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఇండియా కూటమి కలగూరగంపగా తయారైందని దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల్లో మీకు మెజారిటీ లభిస్తే మీ ప్రధాన మంత్రి ఎవరని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నానని అన్నారు. శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే పదవిని పంచుకుంటారా అని ప్రశ్నించారు. విపక్ష ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా అని నిలదీశారు.
విపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్ధిపై వారికి స్పష్టత లేదని అన్నారు. ఇండియా కూటమి విజయం సాధిస్తే ఏడాదికో ప్రధాని అవుతారని చెప్పారు. దేశ ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని అమిత్ షా పేర్కొన్నారు.
Read More :