కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కుపైగా స్ధానాల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో బీజేపీ మాత్రమే చొరబాట్లను నిలువరిస్తుందని అన్నారు. అసుగ్రాంలో శనివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బెంగాల్ లో బీజేపీ పవనాలు వీస్తున్నాయని చెప్చుకొచ్చారు.
మే 2 తర్వాత దీదీ ఇంటి బాట పడతారని, బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అంతకుముందు ఉత్తర 24పరగణాల జిల్లా అమ్దంగలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. దీదీ పాలనకు బెంగాల్ ప్రజలు చరమగీతం పాడనున్నారని పేర్కొన్నారు. బెంగాల్ లో అయిదో దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఏప్రిల్ 29 నాటికి ఎనిమిది దశల పోలింగ్ ముగియనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.