న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ దాచడానికి, భయపడటానికి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున ఒక కేంద్ర మంత్రిగా ఇంతకంటే తానేమీ వ్యాఖ్యానించలేనని, కామెంట్ చేయడం సరికాదని తాజాగా ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమిత్షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. దాచేందుకు, భయపడేందుకు ఏమీ లేనప్పుడు.. హిండెన్బర్గ్ నివేదికపై జేపీసీ వేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదని ప్రశ్నించాయి. చర్చకు కూడా ప్రభుత్వం పారిపోతున్నదని విమర్శించాయి.