Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులకు వాతావరణ శాఖ (IMD) పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటికే వరదలతో అల్లాడుతుండగా.. ఢిల్లీలో రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.
మరోవైపు గత మూడు రోజులుగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునమ్మ కాస్త నెమ్మదించింది. శనివారం ఉదయానికి యమునా నది (Yamuna River)లో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ప్రమాద స్థాయి కంటే రెండు మీటర్ల మేర ఎక్కువే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుతుండటంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.
కాగా, వరదల కారణంగా ఢిల్లీ అస్తవ్యస్తంగా మారింది. ఏ రోడ్డు చూసినా మోకాళ్ల లోతు నీటితో నిండిపోయి ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం సహా మంత్రుల ఇళ్లు, సచివాలయం, ఎర్రకోట, రాజ్ ఘాట్, దేశ అత్యున్నత న్యాయస్థానం పరిసరాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఐటీఓ, శాంతి వాన్ ఏరియా, ఇన్ కం ట్యాక్స్ ఆఫీస్ తదితర ప్రాంతాలు జలదిగ్భందంలో ఉన్నాయి.
Also Read..
Tamannaah-Vijay Varma | తమన్నాని పిచ్చిగా ప్రేమిస్తున్నా : విజయ్ వర్మ
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Delhi Floods | ఢిల్లీ వరదలకు హర్యానా ప్రభుత్వమే కారణం : ఆప్