Delhi Floods | ఢిల్లీ వరదలకు (Delhi Floods) హర్యానా (Haryana) ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేసేందుకే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ (Hathni Kund ) బ్యారేజీ నుంచి యమునా నది (Yamuna river)కి నీటిని వదులుతోందని ఆమ్ ఎంపీ (AAP Mp) సంజయ్ సింగ్ (Sanjay Singh) విమర్శించారు.
‘ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలే లేవు. అయినా యమునా నదిలో నీటి మట్టం తగ్గకపోగా అంతకంతకూ పెరుగుతూ.. ప్రమాదకర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీళ్లు వచ్చి చేరాయి. దీనికి కారణం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని మల్లించడమే. వరదలు వస్తే హత్నీకుండ్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వైపునకు సమతూకంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసేందుకు మూడు కెనాల్స్ ఉన్నాయి. అయితే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢీల్లీ సర్కారును ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని భారీగా వదులుతోంది. మూడు కాలువల ద్వారా నీటిని వదిలి ఉంటే ఢిల్లీలో ఈ స్థాయిలో వరదలు వచ్చేవి కావు’ అని సంజయ్ సింగ్ తెలిపారు.
Also Read..
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Triple Talaq | కట్నం కింద కారు ఇవ్వలేదని.. నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్