వైస్చాన్స్లర్ల వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భవిష్యత్లో తలెత్తే నీటి సంక్షోభాలను నివారించాలంటే వాననీటి వనరుల సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. తెలంగాణ, పుదుచ్చేరిలోని అన్ని యూనివర్సిటీలను హరిత క్యాంపస్లుగా, వర్షపునీటి సంరక్షణ కేంద్రాలుగా మార్చాలని వైస్చాన్స్లర్లకు సూచించారు. నేషనల్ వాటర్ మిషన్ చేపట్టిన ‘క్యాచ్ ద రెయిన్’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ, పుదుచ్చేరిలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లతో, రెడ్క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక వైపు వర్షాలు విస్తారంగా కురవడం, వాన నీరు వృథాగా పోయి నీటికొరత ఏర్పడడం విచారకరమని పేర్కొన్నారు.