Poll Panel | వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్వేవ్ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది (Poll Panel Issues Advisory).
లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించననుంది. ఈ ఎన్నికల సమయంలోనే ఎండలు కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈసీ ఓటర్ల (Voters)కు పలు సూచనలు చేసింది.
Also Read..
Varun Gandhi | బీజేపీ మొండిచేయి.. వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేత
Actor Nani | హీరో నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
Stellantis layoffs | ఉద్యోగులకు భారీ షాక్.. ఒక్క ఫోన్కాల్తో వందల మందిపై వేటు వేసిన స్టెల్లాంటిస్