లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ‘విద్యుత్ సంక్షోభం’ ఏర్పడింది. తమ డిమాండ్లపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం వల్ల కష్టాలు పడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ముందుకు వచ్చింది.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ‘బిజిలీ వ్రతాన్ని’ ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ సమస్య పరిష్కారమయ్యే వరకు జనరేటర్లు వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులను వినియోగించ వద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. ‘ఎస్పీ నేతలు ‘బిజిలీ వ్రతం’ చేస్తారు. ప్రజలకు మద్దతుగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
మరోవైపు విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల కరెంట్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కూడా స్పందించింది. దీనిపై శనివారం నిరసన చేపట్టింది. బీజేపీ నేతృత్వంలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించింది. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టింది.
उप्र की जनता जिस तरह बिजली संकट से जूझ रही है, उसे देखते हुए हम ये अपील करते हैं कि सपा के नेतागण, कार्यकर्ता व शुभचिंतक तब तक इन्वर्टर या जेनरेटर जैसे बिजली के वैकल्पिक साधनों का व्यक्तिगत प्रयोग न करें जब तक बिजली की बहाली न हो जाए।
सपा ‘बिजली-व्रत’ करेगी और जनता का साथ देगी।
— Akhilesh Yadav (@yadavakhilesh) March 19, 2023
Also Read: