India – Pakistan | భారత్ – పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు చెప్పినట్లుగా.. ఆందోళన కలిగించే సమస్యలపై భారత్ – పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతు ఇస్తామన్నారు. ఆగస్టు 5న జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ప్రకటన చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రస్తుత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్లో చర్చలు జరపాలనే కోరికను వ్యక్తం చేశారు.
సోమవారం ఇస్లామాబాద్లో మినరల్స్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశారు. దేశ పునర్నిర్మాణానికి పొరుగుదేశాలతో చర్చలకు సిద్ధమన్నారు. గతంలోనూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రెండుదేశాల మధ్య చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న ఆయన.. అంతకుముందు చర్చలకు రెండుదేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఇరుదేశాల మిత్రదేశంగా చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని నైడ్ప్రైస్ స్పష్టం చేశారు. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలో సైతం అగ్రరాజ్యం మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నది. ఇటీవల ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొసాద్ చీఫ్ డెవిన్ బర్నియా అమెరికాలో పర్యటించారు.
అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సుల్లివన్తో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య చర్చలు జరుపుతుండగా.. ఇరుదేశాల మధ్య మరోసారి దౌత్య సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కశ్మీర్ వ్యవహారంతో పాటు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దిలా ఉండగా.. ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, దాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లడఖ్ను విభజించింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం.. ఇస్లామాబాద్లోని భారత రాయబారిని బహిష్కరించింది, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది.