Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. జులై నుంచి ఒకటి నుంచి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1.4లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఒకే రోజు గుహను బుధవారం అమర్నాథ్ గుహను 9వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. యాత్ర పహల్గామ్, బల్తాల్ నుంచి సాగుతుందని, యాత్ర యాత్రికులకు చిరస్మరణీయమైన అనుభవంగా ఉంటుందని పేర్కొన్నారు. యాత్రలో సుమారు 30 ప్రభుత్వ శాఖలు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నాయి. యాత్రికుల కోసం పలు సౌకర్యాలు కల్పించగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్రకు విదేశాల నుంచి సైతం పర్యాటకులు తరలివస్తున్నారు. రెండు రోజుల కిందట నేపాల్కు చెందిన 33 మంది గుహలో మంచులింగాన్ని దర్శించుకున్నారు. జులై ఒకటిన ప్రారంభమైన యాత్ర 62 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 31తో యాత్ర ముగియనున్నది.