శ్రీనగర్, ఆగస్టు 9: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ము నుంచి శ్రీనగర్కు వెళ్లే యాత్రికులు, శ్రీనగర్ నుంచి జమ్ముకి తిరిగి వచ్చే యాత్రికులు ప్రస్తుతం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. బండరాళ్ల తొలగింపు పూర్తికాగానే రాకపోకలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.