ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు. అమర జవాన్ జ్యోతిని శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఈ జ్యోతిని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతిలో కలిపేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు అమర జవాన్ జ్యోతిని.. యుద్ధస్మారక జ్యోతిలో కలపనున్నారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే.. రెంటినీ కలిపేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.
1971లో ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1972లో అమర జవాన్ జ్యోతిని ప్రారంభించారు. 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.